శివపాల్ యాదవ్ను దగ్గరికి తీసి, సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ను దెబ్బతీయాలని బీజేపీ అధిష్ఠానం వ్యూహం వేసింది. అందులో భాగంగానే శివపాల్ యాదవ్కు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. అయితే శివపాల్ను రాజ్యసభకు కూడా పంపాలని బీజేపీ ఒకానొక దశలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కల్హేర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ… వెంటనే తన వ్యూహం మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. శివపాల్ను డిప్యూటీ స్పీకర్గా ఉంచాలని ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలా చేస్తే.. మైండ్ గేమ్లో భాగంగా అఖిలేశ్ను దెబ్బతీసినట్లవుతుందని బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.
ఇప్పటికి ఎమ్మెల్యేగా శివపాల్ ఆరు సార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఈయన సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్తో పొత్తు పెట్టుకున్నారు. జస్వంత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే అఖిలేశ్, శివపాల్ మధ్య మళ్లీ దూరం పెరిగిపోయింది. ఈ దూరం పెరిగిన తర్వాత శివపాల్ సీఎం యోగితో భేటీ అయ్యారు. భేటీ తర్వాతే.. ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.