ప్రభుత్వ విప్ బాల్క సమన్
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
రెండు వంతెనల నిర్మాణాలు ప్రారంభం
చెన్నూర్, ఏప్రిల్ 27: నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసమే ప్రభు త్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతకానితో కలిసి చెన్నూర్, కోటపల్లి మండలాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్ధ్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. అనంతరం ఎంపీ వెంకటేశ్ నేత మాట్లాడుతూ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, సింగిల్ విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మందమర్రి, ఏప్రిల్ 27 : ఆడబిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటున్నదని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తహసీల్ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్తో కలిసి 72 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమం లో తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, జడ్పీటీసీ వేల్పుల రవి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రావు, చిర్రకుంట, అందుగులపేట గ్రామాల సర్పంచ్లు ఒడ్నాల కొమర య్య, తిరుపతిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు నజీర్ పాల్గొన్నారు.
కోటపల్లి (జైపూర్, భీమారం), ఏప్రిల్ 27 : జైపూర్, భీమారం మండలాల్లోని తహసీల్ కార్యాలయాల ఆవరణలో విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. జైపూర్ మండలంలో 35 మంది, భీమారం 32 మందికి ఉన్నారు. జైపూర్ మండలానికి చెందిన భీమిని శ్రీనివాస్కు ఐటీడీఏ ద్వారా టాటా 407 వాహనం మంజూరు కాగా, అందజేశారు. భీమారం మండలకేంద్రంలో 22 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఆయిల్ పాం నర్సరీని వారు పరిశీలించారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 27 : క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, మందమర్రి తహసీల్దార్ జాడి రాజలింగం, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఆర్ఐ రవి కిశోర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలి..
చెన్నూర్, ఏప్రిల్ 27: పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చె న్నూర్ మున్సిపాలిటీకి మంజూరైన స్వచ్ఛ ఆటోలను ఎంపీ వెంకటేశ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అలాగే జలాల్ పెట్రోల్ బంక్ నుంచి 63 నంబర్ జాతీయ రహదారి వరకు రూ 1.87కోట్లతో చేపట్టే తారు రోడ్డు, చెన్నూర్ నుంచి పౌనూర్ వరకు రూ 1.25 కోట్ల తో చేపట్టే తారు రోడ్డు పనులు, మదునపు పోచమ్మ ఆలయంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న నూతన షెడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్చన్ అర్చనాగిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, సింగిల్ విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
వంతెన పనులు ప్రారంభం..
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విప్ బాల్క సుమన్ అన్నారు. కిష్టంపేటలోని వరలక్ష్మి కాటన్ మిల్లు సమీపంలో జాతీయ రహదారిపై నూతన వంతెన నిర్మాణానికి ఎంపీ వెంకటేశ్తో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ… డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3. 50 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి ఎంపీటీసీలు, వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
తుంతుంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి..కోటపల్లి, ఏప్రిల్ 27 : మండలంలోని ఎదుల్లబంధం గ్రామ సమీపంలోని తుంతుంగా వాగుపై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేయగా, విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కొబ్బరికాయ కొట్టి మంగళవారం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఎదుల్లబంధం, సిర్స, పుల్లగామ, రొయ్యలపల్లి, వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలుగామ ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయన్నారు. అనంతరం పారుపల్లి నుంచి కోటపల్లి వరకు 12 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు రూ.5.6 కోట్లు, జాతీయ రహదారి నుంచి ఎదుల్లబంధం గ్రామం వరకు ఉన్న 10 కిలోమీటర్ల బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.1.6 కోట్లు మంజూరు కాగా పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఆజ్గర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, పీఏసీఎస్ అధ్యక్షుడు పెద్దపోలు సాంబాగౌడ్, సర్పంచ్లు కొఠారి నిర్మల, గట్టు లక్ష్మణ్ గౌడ్, పెద్దింటి పున్నం చంద్, కుమ్మరి సంతోష్, ఎంపీటీసీ జేక శేఖర్, మారిశెట్టి తిరుపతి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, మండల నాయకులు మంత్రి రామయ్య, ఎరినాగుల ఓదెలు పాల్గొన్నారు.