Kalpana Soren | మనీలాండరింగ్ (money laundering case) ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) ఎట్టకేలకు కనిపించారు. రాంచీలో ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. అయితే, మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సోరెన్ రాంచీలో ఉన్నట్లు వెల్లడికావడంతో ఆయన్ని ఈడీ అధికారులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓవైపు ఈడీ విచారణ, మరోవైపు సీఎం అందుబాటులో లేకపోవడంతో ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren)కు సీఎం బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హేమంత్ సోరెన్ అధ్యక్షతన రాంచీలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హేమంత్ సోరెన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొనడం నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఒకవేళ హేమంత్ సోరెన్ అరెస్టై జైలుకు వెళితే ఆయన భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై సమావేశంలో చర్చిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టానికి JMM పావులు కదుపులోందని, అందుకే అధికార కూటమిలోని ఎమ్మేల్యేలను రాంచీలో ఉండాలని కోరిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సాయంత్రం 4:30 గంటలకు సోరెన్ పార్టీ మీడియా ముందుకు రానుంది. ఆ సమావేశంలో ఊహాగానాలకు తెపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ నివాసంతోపాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Also Read..
Hemant Soren | సోరెన్ మిస్సింగ్.. ఆచూకీ చెప్తే నగదు రివార్డు.. ప్రకటించిన బీజేపీ నేత
Hemant Soren | సోరెన్ ఇంట్లో రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు