Udhayanidhi Stalin | ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు చెందిన ఒక హిందూ ధర్మకర్త పరంధాస్ అచార్య (Paramhans Acharya).. ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి పోస్టర్ను ఖర్గంతో వధించి.. ఉదయనిధి తలను నరికిన వారికి రూ.10 కోట్లు రివార్డు కూడా ప్రకటించారు. ఆ పని ఎవరూ చేయలేకపోతే.. తానే చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
స్వామీజీ వ్యాఖ్యలపై ఉదయనిధి తాజాగా స్పందించారు. తన తల కోసం రూ.10 కోట్లు అవసరం లేదన్నారు. తన తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల కోసం జీవితాన్నే పణంగా పెట్టిన కరుణానిధి మనవడిని అని పేర్కొన్నారు. ‘ఒక స్వామి నా తలపై రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించాడు. ఉదయనిధి తల నరికిన వారికి రూ. 10 ఇస్తానని చెప్పాడు. ఆయన కోటీశ్వరుడు. అతను నిజమైన పుణ్యాత్ముడా లేక డూప్లికేటేనా..? స్వామీజీ అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు?’ అని ఉదయనిధి ప్రశ్నించారు.
Also Read..
Ram Charan | దుమారం రేపుతున్న ఉదయనిధి వ్యాఖ్యలు.. ‘సనాతన ధర్మం’పై రామ్ చరణ్ ట్వీట్ వైరల్
G20 Summit | ఆ మూడు రోజులు ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ సహా పలు ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్
Vijay Deverakonda | ఖుషి సక్సెస్తో ఫుల్ ఖుషీలో విజయ్.. ఫ్యాన్స్కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన