న్యూఢిల్లీ: మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని కేంద్రం అబద్ధాలు చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆజ్తక్ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అఖిలేష్ మాట్లాడుతూ బీజేపీ కంటే పెద్ద కుటుంబ పార్టీ ఈ దేశంలో మరొకటి లేదని విమర్శించారు. ఆ పార్టీలో చాలా మంది వారసత్వ రాజకీయాల ద్వారానే పదవులు పొందారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం పేదల పొట్టకొట్టి దేశ సొమ్మును పెద్దలకు పంచుతున్నదని విమర్శించారు. మోదీ పాలనలో పలువురు బడా కార్పొరేట్లు బ్యాంకుల్లో వేల కోట్ల రూపా యల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి విదేశాలకు పారిపోతున్నారని అఖిలేశ్ పేర్కొన్నారు.