లక్నో: ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రమైన హామీలు కుమ్మరిస్తారు. జనాలను తమ వైపు మలుపుకునేలా ఆచరణకు సాధ్యంకాని మాటలు చెబుతుంటారు. గతంలో జరిగిన ఓ ఎన్నికల సందర్భంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు.. తాము అధికారంలోకి వస్తాం.. ఎవ్వరూ ట్రాఫిక్ చాలాన్లు కట్టొద్దు అని ప్రకటించారు. ఇలాంటి కోవలోకే వస్తుంది ఉత్తరప్రదేశ్లో ఓ పార్టీ అధ్యక్షుడి హామీ..
‘70 సీట్లలో మూడు వందల మంది ప్రయాణికులతో వెళ్లే రైలుకు ఎలాంటి చాలాన్లు ఉండవు. మరి బైక్పై ముగ్గురు వెళ్తే మాత్రం చాలాన్ ఎందుకు’ అని సుహేల్దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ ( SBSP) అధినేత ఓపీ రాజ్భర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బైక్పై ట్రిపుల్ రైడింగ్ను ఉచితం చేస్తామని హామీ ఇచ్చారు. లేకపోతే జీపులు, రైళ్లపై చాలాన్లు విధిస్తామన్నారు.
#WATCH | A train carries 300 passengers on 70 seats & doesn't get challans… why's there a challan if 3 people ride a bike? When our govt comes to power, 3 riders will be able to ride a bike for free, otherwise, we'll put challan on jeeps/trains: SBSP founder & chief OP Rajbhar pic.twitter.com/GRdezXPv6C
— ANI (@ANI) February 9, 2022
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో కలిసి SBSP పోటీచేస్తున్నది. మొత్తం 24 స్థానాల్లో తన అభ్యర్థులను నిలుపుతున్నది. యూపీలో మొత్తం ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.