Mohan Bhagwat | ప్రపంచం మొత్తానికి భారత్ అవసరమని, ఇందుకు అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితి కొనసాగుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకు తెలుసునన్నారు. మహారాష్ట్ర పుణేలో జిల్లా అలండిలో జరిగిన గీతా భక్తి అమృత్ మహోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.
జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ్లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం సాహసోపేతమైన మోహన్ భగవత్ అభివర్ణించారు. దేవుడి ఆశీస్సులు, సంకల్పంతోనే ఇది సాధ్యమైందన్నారు. రామ్లల్లాను జన్మస్థానంలో దర్శించుకునే అవకాశం రావడం నేటి తరానికి దక్కిన అదృష్టమన్నారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా.. గీతా భక్తి అమృత మహోత్సవాన్ని గీతా పరివార్ నిర్వహించింది.