తేజస్వీ యాదవ్
పాట్నా, మే 8: ప్రశాంత్ కిశోర్ ఎవరు.. అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. గడిచిన 30 ఏండ్లలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీనిపై తేజస్వీ స్పందిస్తూ… ప్రశాంత్ కిశోర్ ఎవరన్నారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.