Coronavirus | కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ బుసలు కొడుతోంది. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కేరళలో జేఎన్.1 బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
జేఎన్.1 వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (variant of interest)గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని వివరించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గత 24 గంటల్లో 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది. ఇక 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు.
NEW: #COVID19 variant of interest JN.1
Due to its rapidly increasing spread, WHO is classifying the variant JN.1 as a separate variant of interest (VOI) from the parent lineage BA.2.86. It was previously classified as VOI as part of BA.2.86 sublineages.
Based on the available… pic.twitter.com/lvyd3sq1f7
— World Health Organization (WHO) (@WHO) December 19, 2023
Also Read..
Sonia Gandhi | ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు.. ఎంపీల సస్పెన్షన్పై సోనియా గాంధీ
Coronavirus | కొత్తగా 341 కరోనా కేసులు.. మూడు మరణాలు.. అత్యధికంగా కేరళలోనే
Coronavirus | కొవిడ్పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన