న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన రామ మందిరం గురించి ఇవాళ లోక్సభలో స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. బీజేపీ ఎంపీ సత్యపాత్ సింగ్(MP Satya Pal Singh) ఆ చర్చను ప్రారంభించారు. డీఎంకే నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నా.. రాముడి అంశంపై చర్చ కొనసాగింది. రామకథను చర్చించడం వల్ల పార్లమెంటరీ నేతలకు పుణ్యం వస్తుందని ఎంపీ సత్యపాల్ అన్నారు. జనవరి 22వ తేదీన జరిగిన ప్రాణ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అయోధ్యలోని రామజన్మభూమిలో రాముడికి పూజలు చేయడం చరిత్రాత్మకమన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ మతం ఉంటుందని, ధర్మాన్ని నాశనం చేసినవాళ్లకు మరణం తప్పదని, ధర్మాన్ని కాపాడినవాళ్లకు రక్షణ ఉంటుందన్నారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించేందుకు ఆ పార్టీ ఈ పరిస్థితిలో ఉందని ఎంపీ సత్యపాల్ తెలిపారు.
#WATCH | During the discussion on the construction of the historic Ram Temple and Pran Pratishta begins in Lok Sabha, BJP MP Satya Pal Singh says “Where there is Ram, there is religion…those who destroy Dharma, are killed and those who protect Dharma, are protected. Congress is… pic.twitter.com/4VUnHVfarU
— ANI (@ANI) February 10, 2024