న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడు బీజేపీ ఎంపీలంతా పారిపోయారని (BJP MPs ran away) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్ నిరసన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంత మంది యువకులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగ విడుదల చేశారని, దీంతో బీజేపీ ఎంపీలు వెనక్కి వెళ్లారని అన్నారు. ‘బీజేపీ ఎంపీలందరూ పారిపోయారు. వారు చాలా భయపడిపోయారు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై రాహుల్ గాంధీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చొరబాటుదారులను అలాంటి చర్యకు ప్రేరేపించడం పలు ప్రశ్నలు లేవనెత్తుతోందని తెలిపారు. ‘ఈ సంఘటనలో భద్రతా ఉల్లంఘన ప్రశ్న ఉంది. అయితే వారు ఈ విధంగా ఎందుకు నిరసన వ్యక్తం చేశారనేది మరో ప్రశ్న. దేశంలో నిరుద్యోగమే దీనికి సమాధానం’ అని అన్నారు. నిరుద్యోగం కారణంగా దేశంలోని యువత రోజులో సగటున 7.5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని తెలిపారు. అయితే దేశంలోని నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడం లేదని విమర్శించారు. సస్పెండ్ చేసిన ఎంపీని తాను వీడియో తీయడం గురించి మీడియా బాగా ఫోకస్ చేసిందని ఎద్దేవా చేశారు.
#WATCH | At INDIA bloc protest at Jantar Mantar, Congress’ Rahul Gandhi says, “2-3 youth entered Parliament and released smoke. At this BJP MPs ran away. In this incident, there is the question of security breach, but there is another question of why they protested this way. The… pic.twitter.com/ll5K8Sp3gp
— ANI (@ANI) December 22, 2023