న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: గోధుమల ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. డీలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన స్టాక్ లిమిట్ను 3,000 టన్నుల నుంచి 2,000 టన్నులకు కుదించింది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దేశంలో సరిపడా గోధుమలు ఉన్నాయని, కానీ కొంతమంది కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పేర్కొంది.