లక్నో: ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశాలను పట్టించుకోకుండా తమదైన పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే వీడియో గేమ్స్ ఆడటంలో బిజీ అయ్యారు. మరో బీజేపీ ఎమ్మెల్యే సభలోనే పొగాకు డబ్బా తీసి నోట్లో వేసుకున్నారు. యూపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఈ వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘ఈ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పోస్ట్ చేసిన ఒక వీడియోలో మహోబా ఎమ్మెల్యే రాకేష్ గోస్వామి ట్యాబ్లో కార్డ్ గేమ్ ఆడుతూ కనిపించారు. ఝాన్సీ ఎమ్మెల్యే రవిశర్మ అసెంబ్లీలో కూర్చొని పొగాకు నమిలారు. ఈ వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ పార్టీ సీఎం ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ‘ఈ వ్యక్తుల వద్ద ప్రజా సమస్యలకు సమాధానాలు లేవు. అసెంబ్లీని వినోద కేంద్రంగా మార్చారు. చాలా అసహ్యకరం, అవమానకరం’ అని ఎస్పీ విమర్శించింది.
కాగా, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా దీనిపై ట్విట్టర్లో స్పందించారు. యూపీ విధానసభలో బీజేపీ ఎమ్మెల్యేలు పేకాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ వీడియోను రికార్డు చేసి వైరల్ చేయడం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం పని చేసిన ఇతర బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ‘ఇప్పుడు సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఎమ్మెల్యేపై ‘మోరల్ బుల్డోజర్’ ఎప్పుడు నడుస్తుంది? అని ప్రశ్నించారు. మరోవైపు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
— Samajwadi Party (@samajwadiparty) September 24, 2022
भाजपाई विधायक उप्र विधानसभा के सत्र में खेल रहे हैं ताश और कर रहे हैं प्रदेश का नाश।
भाजपा के उन विधायक जी को धन्यवाद जिन्होंने पीछे से ये वीडियो बनाकर व वाइरल कर जनहित का काम किया।
अब देखना ये है कि मुख्यमंत्री जी इन मा. विधायकजी पर ‘नैतिक बुलडोज़र’ कब चलाएँगे?#भार_बन_गयी_भाजपा pic.twitter.com/qYU9vFiYOw— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2022