కోల్కతా, జూన్ 21: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నది. హౌరా జిల్లా ఉల్బేరియా-1 బ్లాక్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాల్ని ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది.
జూలై 7కల్లా కోర్టుకు నివేదిక సమర్పించాలని సీబీఐ జాయింట్ డైరెక్టర్కు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉండగా, జూలై 8న జరగనున్న ఎన్నికల పోలింగ్కు 82వేల మందికిపైగా కేంద్ర బలగాల్ని మోహరించాలని, 24గంటల్లోగా ఈ ప్రక్రియ ముగించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.