కోల్కతా: భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది. 2024 జనరల్ ఎలక్షన్స్కు కొన్ని నెలల ముందు పంచాయతీ ఎన్నికలు జరగడంతో అధికార టీఎంసీ (Trinamool Congress), ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ (BJP) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పెద్ద ఎద్దున హింస చెలరేగింది. రాజకీయ ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, బాలెట్ పేపర్లకు నిప్పంటించడం, చెరువుల్లో పడేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక పరస్పర దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మూడంచెల పంచాయతీ (Panchayat elections) ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 6100కుపైగా పోలింగ్ బూతుల్లో ఈ నెల 8న పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 80.71 శాతం పోలింగ్ నమోదయింది. అయితే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగడంతో 19 జిల్లాల్లోని 696 బూత్లలో సోమవారం రీ పోలింగ్ (Re-polling) జరుగగా 69.85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కాగా, 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం పంచాయతీల్లో గెలుపొందింది. 22 జిల్లా పరిషత్తులపై (Zilla parishads) జెండా ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో కూడా పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
#WATCH | West Bengal Panchayat poll result 2023: Security deployed; visuals from Berhampore Girls College, Murshidabad. pic.twitter.com/JweuOBB09F
— ANI (@ANI) July 11, 2023
#WATCH | Cooch Behar | West Bengal Panchayat poll results 2023: Security deployed at counting centre; counting of votes to begin shortly.
(Visuals from Dinhata) pic.twitter.com/8HFDUvBuXT
— ANI (@ANI) July 11, 2023
#WATCH | West Bengal Panchayat polls result 2023: Security deployed at counting centre. Visuals from Narayantala Ramkrishna Vidhya Mandir, South 24 Parganas. pic.twitter.com/gvj7Sj85eD
— ANI (@ANI) July 11, 2023