కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అసోం, బిహార్లో ఎన్ని సీబీఐ విచారణ జరిగాయని, ఎంత మంది నేతలను అరెస్టు చేశారని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీని ఉపయోగించి ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తమను బలహీనులుగా చూడొద్దన్నారు. నదియా మైనర్ లైంగిక దాడి, హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని బెంగాల్ సీఎం తెలిపారు. లైంగిక దాడికి గురైందా? ప్రేమ వ్యవహారామా ? లేదంటే అనారోగ్య కారణమా ? విచారణలో తెలుస్తుందన్నారు.