కోల్కతా: కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర తీరుపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కేంద్రం తీరుకు నిరసనగా ఏకంగా ధర్నాకే దిగారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో మమతాబెనర్జి ధర్నాకు కూర్చుకున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఈ ధర్నా కొనసాగనుంది. 100 రోజుల పని సహా పలు పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. దాంతో ఇప్పుడు ధర్నాకు దిగారు. కేంద్రం తీరుతో విసిగిపోయిన మమతాబెనర్జి.. జీఎస్టీ బిల్లుకు అనవసరంగా మద్దతు తెలిపామని ఇటీవల విచారం వ్యక్తం చేశారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee sits on two days Dharna in Kolkata, starting from today against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/tfI45NFZ1u
— ANI (@ANI) March 29, 2023
West Bengal CM Mamata Banerjee sits on two days Dharna starting from today against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/NWqFeQmGod
— ANI (@ANI) March 29, 2023