కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఎస్ఎస్కేఎం దవాఖానలో ఆమె నుదుటిపై మూడు కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు.
అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాత ఆమెను ఇంటికి పంపించారు. మమత పడిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను వెనుక నుంచి ఎవరో తోసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేయడంపై పోలీసులు స్పందించ లేదు.