న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నట్లు పలువురిని మోసగించిన సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశం పంపాడు. (Conman Sukesh Chandrashekhar) కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు బయటపెడతానని, తాను అప్రూవర్గా మారతానని అందులో పేర్కొన్నాడు. ‘నిజం గెలిచింది. ఆయన్ను (అరవింద్ కేజ్రీవాల్) తీహార్ జైలుకు స్వాగతిస్తున్నా’ అని ఒక మెసేజ్లో తెలిపాడు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రభుత్వ అప్రూవర్గా తాను మారుతానని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. ‘నేను ఆయన్ను (కేజ్రీవాల్) బహిర్గతం చేస్తా. నేను అప్రూవర్గా మారుతా. అన్ని ఆధారాలు ఇస్తా. ఆయనకు శిక్ష పడేలా చూస్తా’ అని తెలిపాడు.
మరోవైపు సుమారు రూ. 200 కోట్ల మేర పలువురిని మోసగించడంతోపాటు మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఆప్ మంత్రులతోపాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాను కోట్లలో డబ్బు ఇచ్చినట్లు గతంలో ఆరోపించాడు.