న్యూఢిల్లీ: లోక్సభ, అన్ని రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే ప్రతిపాదనను అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం తేల్చిచెప్పారు.
భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఈ విధానం వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి ఓ లేఖ రాశారు.