ముంబై: మహారాష్ట్రలో మరోమారు భూమి కంపించింది. రాష్ట్రంలోని పాల్ఘర్లో గురువారం ఉదయం 7.07 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు.
పాల్ఘర్లో గత నెల 24న కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రత నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది. నాసిక్కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.