Siddaramaiah | కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను (Results) బట్టి చూస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రంలో పార్టీ గెలుపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah ) స్పందించారు. కర్ణాటకలో తమ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కౌంటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలుస్తుంది. కర్ణాటకలో మా సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం. మాకు ఎవరి మద్దతూ అవసరం లేదు. బీజేపీపై, ఆ పార్టీ అవినీతిపై కర్ణాటక ప్రజలు విసిగిపోయారు’ అని ఆయన అన్నారు.
సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన 8 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) కూడా సీఎం రేసులో ఉన్నారు. అధిష్ఠానం వీరిద్దరిలో ఎవరికి సీఎం పదవిని కట్టబెడుతుందో చూడాలి మరి.
#WATCH | "We told that even if PM Modi comes nothing will work and see that has happened. We are leading in 120 seats. As we expected we will get the majority": Congress leader Siddaramaiah as party crosses majority mark in #KaranatakaElectionResults pic.twitter.com/QW7ozxzYvY
— ANI (@ANI) May 13, 2023
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Karnataka Results | కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ఓటమి అంచున బీజేపీ
Karnataka CM: శివకుమారా లేక సిద్ధిరామయ్యా.. కర్ణాటక సీఎం అయ్యేదెవరు?