న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు స్పష్టమైన ఎజెండాతో విశ్వసనీయ ప్రత్యామ్నాయంతో ముందుకువస్తాయని ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ అన్నారు. బీహార్ పరిణామాలు బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పాయని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. విపక్షాలు ఏకమైతే ప్రజాకోర్టులో బీజేపీని ఓడించవచ్చని బీహార్ సందేశం ఇచ్చిందని చెప్పారు. స్పష్టమైన ఎజెండాతో రాజకీయ ప్రత్యామ్నాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ పరిణామాలతో ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు.