Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ తమకు కావాలంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గువాహటి (Guwahati)లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బైపాస్ నుంచి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాటిని తోసుకుని ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కొందరు పోలీసులపై చేయి చేసుకున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ ను అరెస్ట్ చేయనున్నట్లు సీఎం హిమంత తెలిపారు.
హిమంత వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) ఎక్స్ వేదికగా స్పందించారు. ‘లోక్సభ ఎన్నికల వరకు ఎందుకు వేచి ఉండాలి..? రాహుల్ గాంధీ నిజంగానే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు..? మీరలా చేయలేరు. ఎందుకంటే.. రాహుల్ మాట్లాడుతోంది నిజాలని మీకు తెలుసు. మీ పొరుగు రాష్ట్రమైన మణిపూర్ ప్రజలకు మద్దతుగా మీరు నిలబడలేదు. రాహుల్ చేస్తున్న పని చూసి మీకు భయం పట్టుకుంది’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రియాంక్ ఖర్గే ట్వీట్కి స్పందించిన అస్సాం సీఎం హిమంత శర్మ.. ‘లోక్సభ ఎన్నికల సమయంలో మాకు రాహుల్ గాంధీ కావాలి బ్రదర్’ అంటూ వ్యాఖ్యానించారు.
We need Rahul Gandhi during election Brother https://t.co/00S3zGSFSk
— Himanta Biswa Sarma (@himantabiswa) January 25, 2024
Also Read..
Jagadish Shettar | కర్ణాటకలో కాంగ్రెస్కు గట్టి షాక్.. పార్టీని వీడిన జగదీష్ శెట్టర్
Tamil Nadu | అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి.. షాకింగ్ వీడియో