తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ ( Nipah virus ) సోకి ఈ ఉదయం 12 ఏండ్ల బాలుడు మృతిచెందడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై అప్రమత్తమైన ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెంటనే రంగంలోకి దిగింది. మరణించిన బాలుడు, అతని కుటుంబసభ్యులతో కాంటాక్టు అయిన వారిని గుర్తించింది. మొత్తం 188 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. వారిలో 20 మంది పరిస్థితి హై రిస్క్ కేటగిరీలో ఉన్నదని, అందుకే వారిని కోజికోడ్లోని ఎంసీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నామని ఆమె తెలిపారు.
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైరస్ మరింత విస్తరించకుండా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించామని ఆరోగ్య మంత్రి వీణా జార్జి చెప్పారు. ఇవాళ నిఫా వైరస్ కారణంగా మరించిన బాలుడి ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల మేర లాక్డౌన్ విధించినట్లు ఆమె తెలిపారు.