Priyanka Gandhi : బీహార్ (Bihar) లో మాదిరిగానే దేశమంతటా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమైంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరుగనున్న రాష్ట్రాల్లో ముందుగా రివిజన్ చేపట్టి మిగతా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను ఆ తర్వాత సవరించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ దగ్గర మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోజికోడ్కు వచ్చిన ఆమెను స్థానిక మీడియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అభిప్రాయం కోరింది. దాంతో తాము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకమని ప్రియాంకాగాంధీ స్పష్టంచేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు చోరీచేసి పెడుతోందని ప్రియాంక విమర్శించారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తాము ఇప్పటికే పార్లమెంటు లోపల, బయట పోరాటం చేశామని చెప్పారు. ఇకముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.