అహ్మదాబాద్: గుజరాత్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక ఇంజన్ చెడిపోయిందని, మరో ఇంజన్ పాతదని వ్యాఖ్యానించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి శనివారం గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీని కొత్త ఇంజన్గా అభివర్ణించారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన నవతర సాంకేతికతతో కూడిన 21వ శతాబ్దపు ఇంజన్ అని అన్నారు. కొత్త రాజకీయాలు, కొత్త ముఖాలతో ఇది సజావుగా నడుస్తుందని తెలిపారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా, మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు. రాజకీయాలు, గూండాయిజం కావాలనుకునేవారు బీజేపీకి మద్దతు తెలుపవచ్చన్నారు. తమ వర్గం కోసం ఆసుపత్రులు, క్లినిక్లు, పాఠశాలలు కోరేవారు ఆప్లో చేరవచ్చని పిలుపునిచ్చారు.
అలాగే గుజరాత్లోని బీజేపీ నేతలు, కార్యకర్తలే ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆ పార్టీని అధికారం నుంచి తొలగించాలని వారు ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ‘ఎవరైనా నల్ల జెండాను ప్రదర్శిస్తే వారి కుటుంబ సభ్యులు చికిత్స చేస్తారు. ప్రతి ఒక్కరిని ఆప్లోకి స్వాగతిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | People chanted 'Modi Modi' and 'Chor Chor' slogans and showed black flags to Delhi CM and AAP national convener Arvind Kejriwal as his cavalcade passed by in Gujarat's Navsari today pic.twitter.com/trNJFdIjRQ
— ANI (@ANI) October 29, 2022