న్యూఢిల్లీ, జూలై 27: వీధుల్లో యాచకులను అనుమతించకూడదన్న అభిప్రాయానికి రాలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాచన ఒక సామాజిక-రాజకీయ సమస్య అని పేర్కొంటూ చదవు, ఉపాధి లేకపోవడంతో బతుకీడ్చేందుకు కొందరికి వీధుల్లో యాచన చేయాల్సి వస్తున్నదని తెలిపింది. కరోనా దష్ట్యా యాచకులు, ఇల్లూవాకిలి లేకుండా ఊళ్లు పట్టుకు తిరిగే వ్యక్తులకు వ్యాక్సిన్ వేయించి, పునరావాసం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.