న్యూఢిల్లీ: ఇండియా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ ప్రదర్శన చేపట్టారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా పోరాడుతామని ఆయన అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో వందకుపైగా ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సస్పెన్షన్లను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇవాళ జంతర్ మంతర్లో ఆందోళన చేపట్టారు.
#WATCH | At the INDIA bloc protest at Jantar Mantar in Delhi, NCP chief Sharad Pawar says, “We are ready to pay any price to save the democracy…” pic.twitter.com/SPmsuTshcN
— ANI (@ANI) December 22, 2023
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇద్దరు ముగ్గురు యువకులు పార్లమెంట్లోకి ప్రవేశించి స్మోక్ వదిలారని, ఈ ఘటన పట్ల బీజేపీ సమాధానం ఇవ్వడంలేదని, పరారీ అయ్యిందని అన్నారు. సెక్యూర్టీ ఉల్లంఘన ఎందుకు జరిగిందన్న ప్రశ్న వస్తుందని, అంతేకాదు అసలు ఆ యువత ఎందుకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారన్న ప్రశ్న కూడా తలెత్తుతుందని రాహుల్ అన్నారు. దీనికి కారణం దేశంలో నిరుద్యోగమే అని రాహుల్ ఆరోపించారు.
#WATCH | At INDIA bloc protest at Jantar Mantar, Congress’ Rahul Gandhi says, “2-3 youth entered Parliament and released smoke. At this BJP MPs ran away. In this incident, there is the question of security breach, but there is another question of why they protested this way. The… pic.twitter.com/ll5K8Sp3gp
— ANI (@ANI) December 22, 2023