కన్నూర్, ఏప్రిల్ 26: ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన తిరువనంతపురం-కాసర్ గోడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో మొదటి రోజే వాటర్ లీకేజీ సమస్య ఏర్పడింది. మంగళవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో ఒక బోగీ పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. బుధవారం ఉదయం మరమ్మతులు పూర్తయ్యాక గానీ రైలు కాసర్గోడ్కు ప్రయాణం బయల్దేరలేకపోయింది.