న్యూఢిల్లీ: పూడిక వల్ల భారత్లోని ఆనకట్టల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి 3,700 డ్యాంలలో 26% నిల్వను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో నీటి భద్రత, సాగు, విద్యుదుత్పత్తికి నష్టం వాటిల్లుందని వెల్లడించింది.
యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆన్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ విభాగం ప్రపంచంలోని 50 వేల ఆనకట్టల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఈ డ్యాంలు ఇప్పటికే 13-19% స్టోరేజీని కోల్పోయాయని వెల్లడించింది.