ముంబై: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు రాఖీ కట్టారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనున్న INDIA కూటమి మూడో సమావేశం కోసం మమతాబెనర్జి బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాఖీ కట్టేందుకు బిగ్ బీ అమితాబచ్చన్ ఇంటికి వెళ్లారు. అక్కడ అమితాబ్కు రాఖీ కట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను భారత్ రతన్ అమితాబచ్చన్ను (అమితాబచ్చన్ను మమతాబెనర్జి భారత రతన్ అని పిలుస్తారు) కలిశాను. ఆయనకు రాఖీ కూడా కట్టాను. ఆయన కుటుంబాన్ని నేను చాలా ప్రేమిస్తాను. దేశంలోని వారిది నంబర్ వన్ ఫ్యామిలీ. బెంగాల్లో జరిగే దుర్గా పూజకు, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కావాలని ఈ సందర్భంగా తాను అమితాబ్ను ఆహ్వానించాను’ అని మమత తెలిపారు.
రేపు ఆమె INDIA కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా INDIA కూటమి తొలి సమావేశం ఈ ఏడాది జూన్ 23న బీహార్ రాజధాని పట్నాలో జరిగింది. రెండో సమావేశం జూలై 17, 18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు.
#WATCH | Mumbai: West Bengal CM Mamata Banerjee speaks on her meeting with Bollywood actor Amitabh Bachchan at his residence.
“I am happy today. I met ‘Bharat Ratan’ of India Amitabh Bachchan (Mamata Banerjee called Bollywood actor Amitabh Bachchan Bharat Ratan) and also tied… pic.twitter.com/qoTsYbJVFH
— ANI (@ANI) August 30, 2023