లక్నో: అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు.
ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్టు ‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్కే లియే)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు.
పుణె హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్ ట్రస్ట్ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్ అభినందించారు.
#WATCH | Lucknow, Uttar Pradesh CM Yogi Adityanath participated in the program of offering clothes made for Lord Ram with the help of more than 12 lakh devotees of Heritage Handweaving Revival Charitable Trust, yesterday in Lucknow. pic.twitter.com/Us9Fs8JxOh
— ANI (@ANI) January 17, 2024