సిద్దిపేట, ఏప్రిల్ 28: హనుమంతుని అనుగ్రహంతో సంకల్పం సిద్ధించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని టీచర్స్ కాలనీలో నూతనంగా ప్రతిష్ఠాపన జరిగిన శ్రీ కార్యసిద్ధి వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని రెండో వార్డు నర్సాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవి అష్టమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ఆలయ కమిటీల సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు.
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 28 : పోచమ్మతల్లి దయంతో ప్రజలంతా బాగుండాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ పోచమ్మ తల్లిని, రావురూకుల గ్రామంలోని ముత్యాల పోచమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావురూకుల, బుస్సాపూర్ గ్రామాలకు వచ్చిన మాజీ మంత్రికి ప్రజలు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మాజీ మం త్రి వెంట సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, ప్రభాకర్ వర్మ, బీఆర్ఎస్ సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షుడు ఎర్ర యాద య్య, ఉడుత మల్లేశం, రావురూకుల తాజామాజీ సర్పంచ్ కవితా రవీందర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.