TMC MPs : పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి సొంత నాయకులే ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు అర్జున్ సింగ్, దివ్యేందు అధికారి టీఎంసీకి గుడ్బై చెప్పారు. అనంతరం బెంగాల్ బీజేపీ నాయకుల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బెంగాల్ బీజేపీ నాయకత్వం అర్జున్ సింగ్, దివ్యేందు అధికారిలకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఆ ఇద్దరు నేతలు బీజేపీలో చేరిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి. కాగా దివ్యేందు అధికారి పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారికి సొంత తమ్ముడు కావడం గమనార్హం.
#WATCH | TMC MPs Arjun Singh and Dibyendu Adhikari join the BJP, in Delhi.
Dibyendu Adhikari is the brother of West Bengal LoP Suvendu Adhikari. pic.twitter.com/EsvPucxzwh
— ANI (@ANI) March 15, 2024