తూత్తుకూడి: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి జిల్లా కీల వల్లనాడు గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మురప్పనాడు పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Tamil Nadu: Three people were killed in an accident when a tipper lorry collided with a van near Keela Vallanadu in Thoothukudi District. Further details awaited: Murappanadu Police pic.twitter.com/E0r4t3yJRT
— ANI (@ANI) December 31, 2023