Vijayadharani: లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో విజయధరణి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఆమెకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగాను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ 18 మందిలో ఒక ఎమ్మెల్యే పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లడంతో కాంగ్రెస్ బలం 17కు తగ్గింది. విజయధరణి బీజేపీ కండువా కప్పుకుంటున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Tamil Nadu Congress MLA Vijayadharani joins BJP, in Delhi. pic.twitter.com/eTnkJx2oJe
— ANI (@ANI) February 24, 2024