Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్, ఏప్రిల్ 26న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు వివిధ పార్టీలు తమ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈసారి తమిళనాడులో తప్పనిసరిగా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో సీరియస్గా దూసుకుపోతున్నది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు.
కోయింబత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని ఎలాచియపాలయం గ్రామానికి వెళ్లిన అన్నామలైకి స్థానిక బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టారు. అనంతరం గ్రామంలోని ఓ నేత కార్మికుడి ఇంటికి వెళ్లిన అన్నామలై ఆ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన ప్రచారాన్ని కొనసాగించారు.
#WATCH | Tamil Nadu BJP president and candidate from Coimbatore, K Annamalai eats breakfast at the residence of a power loom worker in Elachipalayam village, Coimbatore#LokSabhaElections2024 pic.twitter.com/ATYhHMK1hm
— ANI (@ANI) April 5, 2024