న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష మహా కూటమి కన్నెర్ర చేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ను కించపర్చేలా మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ప్రతిపక్ష మహా కూటమి ముంబైలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.
ఈ నిరసన ప్రదర్శనలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ అగ్ర నేత అజిత్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొంటారని మహా కూటమి నేతలు చెప్పారు. మహా కూటమి నేతల నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Shiv Sena leader Uddhav Thackeray and NCP leader Ajit Pawar join protest march by Maharashtra Vikas Aghadi (MVA) in Mumbai against the state government and Governor BS Koshyari over his controversial remark on Chhatrapati Shivaji Maharaj pic.twitter.com/iIFUtNiZPj
— ANI (@ANI) December 17, 2022