పట్నా: మహారాష్ట్రలో బీజేపీ కుతంత్ర రాజకీయాలపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) మండిపడ్డారు. శరద్పవార్ ఒక మహోన్నతమైన వ్యక్తి అని, రాజకీయంగా శక్తిమంతుడని లాలూ కొనియాడారు. అలాంటి శరద్పవార్ను షేక్ చేసేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా శరద్పవార్ను ఏమీ చేయలేరని, ఆయన చేసే ప్రతి ప్రయత్నం విఫలమవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
కాగా, మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ చీల్చింది. పవార్ అన్న కొడుకు అజిత్పవార్ పార్టీని వీడి మరో 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏ సర్కారులో చేరారు. అందుకు ప్రతిగా మహా సర్కారు అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంగా, మిగతావారిని మంత్రులుగా క్యాబినెట్లోకి చేర్చుకుంది. ఈ పరిణామాలపై లాలూ తాజాగా స్పందించారు.
#WATCH | “Sharad Pawar ‘ek haisiyat hein aur takat hein’ and PM Modi tried to shake him, but nothing will happen, everything will fail”: RJD leader Lalu Yadav pic.twitter.com/AFLWzzt2JY
— ANI (@ANI) July 3, 2023