న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఢిల్లీ రోడ్డు ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ (DTC) బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, బస్సు ఢీకొట్టడంతో కారు, పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలోని రోహిణి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | One person died after being hit by a DTC bus in Delhi’s Rohini area. Further investigation is underway: Delhi Police
(CCTV visuals confirmed by police) pic.twitter.com/Bt1ipo9GYr
— ANI (@ANI) November 4, 2023