కులూ: హిమాచల్ప్రదేశ్లో వరుణ బీభత్సం కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. ఆ నది ఉధృతికి పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కులూ జిల్లాలోని చారుడు గ్రామంలో ఓ ఇంటిని బియాస్ నది వరద చుట్టుముట్టింది.
ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు వరద మరింత ఉధృతమైతే తమ ప్రాణాలు పోయినట్లేనని భయంతో వణికిపోయారు. సహాయం కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కు చెందిన రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి తాళ్ల సాయంతో ఆ ఐదుగురిని బయటికి తీసుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | NDRF rescues five people from an inundated house as Beas river is in spate in Charudu village, Kullu district of Himachal Pradesh
(Video source: NDRF) pic.twitter.com/xTGhrdjDfF
— ANI (@ANI) July 9, 2023