శ్రీనగర్: ఈ శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తున్నది. దాంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తున్నది.
తాజాగా శ్రీనగర్-లేహ్ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో ఆ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. డోజర్ల సాయంతో రహదారిపై మంచును క్లియర్ చేస్తున్నారు.
బీకన్ ఆఫ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఈ స్నో క్లియరెన్స్ పనుల్లో పురోగతి కనిపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి, మళ్లీ మంచు కురియకపోతే ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
#WATCH | J&K: Snow clearance of Srinagar-Leh highway in progress by project Beacon of Border Roads Organisation pic.twitter.com/abpfJznGtS
— ANI (@ANI) December 30, 2022