న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇవాళ 2022కు సంబంధించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికిపైగా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే.. అన్ని దశలను దాటుకుని ఆఖరికి 933 మంది సర్వీసులను దక్కించుకున్నారు. వారిలో ఉత్తరప్రదేశ్లోని నోయిడా నగరానికి చెందిన ఇషితా కిషోర్ ఆలిండియా టాపర్గా నిలిచారు.
ఇవాళ సివిల్స్ ఫలితాలు వెలువడగానే ఇషితా కిషోర్ ఇంట్లో సంబురాలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆమె ఈ అత్యంత అరుదైన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇషితా కిషోర్ను మీడియా ప్రశ్నించగా ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. భవిష్యత్తులో సివిల్స్ సాధించాలనుకునే వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారని అడుగగా.. క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చని చెప్పారు.
#WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, “One has to be disciplined and sincere to be able to achieve this.” pic.twitter.com/YKziDcuZJz
— ANI (@ANI) May 23, 2023
#WATCH | UPSC Civil Services Examination 2022 topper Ishita Kishore says it’s important to “constantly re-evaluate your strategy” to succeed pic.twitter.com/I6EhJs3rtK
— ANI (@ANI) May 23, 2023