Kite festival: ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. ఏటా జనవరి 7న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఎప్పటిలాగే గుజరాత్ పర్యాటక శాఖ ఇవాళ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించింది.
గుజరాత్లో ఏటా జరిగే ఈ కైట్ ఫెస్టివల్కు ఒక చరిత్ర ఉన్నది. అహ్మదాబాద్కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్భాయ్ రహీంభాయ్ 1989 జనవరి 7న 500 గాలిపటాల రైలును తయారుచేసి ఎగరవేశాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 7న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతున్నది.
జనవరి 14 వరకు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఒకచోట గుమిగూడి పతంగులు ఎగురవేస్తారు. కుటుంబసభ్యులు అంతా ఇళ్లపైకి చేరి కూడా ఈ పతంగుల పండుగ జరుపుకుంటారు. ఇవాళ అహ్మదాబాద్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పతంగ్ను ఎగరవేశారు.
#WATCH | International Kite Festival being held in Ahmedabad, Gujarat. Visuals from the venue. pic.twitter.com/k9iFC4zsxZ
— ANI (@ANI) January 7, 2024
#WATCH | Gujarat CM Bhupendra Patel flies a kite at the International Kite Festival in Ahmedabad. pic.twitter.com/59lIpRg4HV
— ANI (@ANI) January 7, 2024