పట్నా: దేశంలో లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు రావడానికి అభ్యంతరమేముందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరుగుతాయో ఎవరికి తెలియదని, కాబట్టి తాను సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరగాలని తాను ఎప్పటి నుంచి చెబుతూ వస్తున్నానని నితీశ్ కుమార్ చెప్పారు. సాధారణ ఎన్నికలు ఎంత ముందు జరిగితే అంత మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వస్తే బీహార్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలే తేల్చి చెబుతారని అన్నారు.
#WATCH | I have always been saying that the (Lok Sabha) elections should be conducted early. It is better if the polls are conducted early. Nobody knows when the elections will be conducted, so I request to do it as early as possible: Bihar CM Nitish Kumar
(Source: IPRD Bihar) pic.twitter.com/gQOVHJEIVI
— ANI (@ANI) June 14, 2023