భుజ్: గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను బీభత్సం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. తాజాగా భుజ్ జిల్లాలోని భవానీపూర్ గ్రామంలో బలమైన ఈదురుగాలులు, వరద తాకిడికి రోడ్డుపై నిర్మించిన ఓ బ్రిడ్జి కూలిపోయింది.
దాంతో ఆ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి వంతెనను నిర్మిస్తేగానీ ఆ రోడ్డు గుండా వాహనాల రాకపోకలను పునరుద్ధరించే అవకాశాలు కనిపించడంలేదు. బ్రిడ్జి కూలిపోయిన అనంతరం రోడ్డు నడుమ ఏర్పడిన గొయ్యిలోంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Gujarat | A small bridge washed away in the strong winds and rainfall, that occurred under the influence of #CycloneBiparjoy, near Bhavanipar village of Bhuj. No injuries or casualties were reported. pic.twitter.com/H2FHtwDg9i
— ANI (@ANI) June 16, 2023
కాగా, అరేబియా సముద్రం దక్షిణ భాగాన ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను గత వారం పదిరోజులుగా ఉత్తరదిశగా పయనించి చివరి తూర్పువైపు తన దిశను మార్చుకుని గుజరాత్పై పడింది. దాంతో గుజరాత్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావం క్రమంగా రాజస్థాన్పై కూడా పడింది.