భోపాల్: మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఊపందుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల ముందు జనం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ఇండోర్లోని 163వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, మధ్యప్రదేశ్లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతున్నది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న రాజస్థాన్లో, 30న తెలంగాణలో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 7న మిజోరంలోని 40 స్థానాలకు ఒకే విడతలో, ఛత్తీస్గఢ్లో 20 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.
#WATCH | Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote at polling booth number 163 in Indore.#MadhyaPradeshElection2023 pic.twitter.com/eqgWsUSrrS
— ANI (@ANI) November 17, 2023