Fire accident | మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పటాకులు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో మరొకరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో మరో 59 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
కాగా, మంగళవారం ఉదయం హర్దా జిల్లా బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దాకా వినిపించింది. చుట్టుపక్కల 60 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించి మంటలను ఆర్పుతున్నారు. పటాకుల ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్కు చేసి ఉన్న పలు వాహనాలు కూడా ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి.
#WATCH | Firefighting operation is underway at the firecracker factory in Harda, Madhya Pradesh where a massive explosion took place today.
Six people have died and 59 others are injured in the incident. pic.twitter.com/rbUFx6v6UH
— ANI (@ANI) February 6, 2024