రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలు తెగల జానపద కళాకారులు తమ నృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆఫ్రికా సంతతికి చెందిన సిద్దీ తెగ జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసి చూపరులను అకట్టుకున్నారు.
ఈ సిద్దీ తెగవారు దాదాపు 850 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఛత్తీస్గఢ్కు వలస వచ్చారట. అప్పటి నుంచి వారు ఇక్కడ జీవనం సాగిస్తూనే వారి సంప్రదాయ నృత్య కళకు జీవం పోస్తూ వస్తున్నారు. ఫెస్టివల్ సందర్భంగా సిద్దీ తెగ ఫోక్ ఆర్టిస్ట్లను మీడియా పలుకరించగా.. తమ సంస్కృతి ఆఫ్రికాది అయినా, తమ హృదయాలు మాత్రం భారత దేశానివని చెప్పారు.
మా పూర్వీకులు తమతోపాటు మా సిద్దీ తెగకు సంబంధించిన సంప్రదాయ నృత్య కళను ఇక్కడి తీసుకొచ్చారని తెలిపారు. మా కళాకారుల బృందం ఆ కళకు జీవం పోస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. మా మూలాలు ఆఫ్రికాలో ఉన్నా మేం మాత్రం భారతీయులమేనని వారు చెప్పారు. భారత్ లాంటి దేశం ప్రపంచంలో మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు.
#WATCH | Chhattisgarh: African origin Siddi tribe who came to India 850 years ago performed their cultural dance form at the National Tribal Dance Festival in Raipur pic.twitter.com/V3DVXraKWm
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 3, 2022